కర్నూలు ప్రైవేటు బస్సు ప్రమాదం చాలా కుటుంబాల్లో విషాదం నింపింది. దీపావళికి ఇంటికొచ్చి వెళ్తున్న ఐటీ ఉద్యోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఖమ్మం జిల్లా వల్లభి గ్రామానికి చెందిన మేఘనాథ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూడా ఈ దుర్ఘటనలో సజీవ దహనమయ్యాడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడైన మేఘనాథ్ ఉద్యోగంలో చేరిన ఐదు నెలలకే ప్రాణాలు కోల్పోయాడు.