తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ విరాళాల రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పార్టీకి అందిన విరాళాలు గతంతో పోలిస్తే 97.40 శాతం పడిపోయి కేవలం రూ.15.09 కోట్లకు పరిమితమయ్యాయి. ఎలక్టోరల్ బాండ్ల రద్దు, ఎన్నికల్లో ఓటమి దీనికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.