జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన, గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య పరీక్షలలో కిడ్నీ ఫెయిల్యూర్ నిర్ధారణ కావడంతో, పరిస్థితి క్షీణించినట్లు సమాచారం. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని నియోజకవర్గ ప్రజలు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.