తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించటం కష్టమైపోతోంది. ఈ క్రమంలోనే.. కరీంనగర్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. నిన్న (జనవరి 24) కరీంనగర్లో నిర్వహించిన స్మార్ట్ సిటీ ప్రారంభ పనుల సభకు అధ్యక్షత వహించిన మేయర్ సునీల్ రావు.. తెల్లారగానే బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. పలువురు కార్పొరేటర్లతో కలిసి.. బీజేపీ కండువా కప్పుకున్నారు. అంతేనా.. నిన్నటి వరకు కలిసే ఉన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీద సంచలన ఆరోపణలు గుప్పించారు.