ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొంటున్న హరీష్ రావు, ప్రజల దృష్టిని మళ్లించేందుకే సృజన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సృజన్ రెడ్డి ముఖ్యమంత్రికి దూరపు బంధువైనప్పటికీ.. ఆయన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి స్వయానా అల్లుడని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ సృజన్ రెడ్డికి అనేక కాంట్రాక్టులు దక్కాయని.. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నించారు. సింగరేణిలో 2014 నుండి జరిగిన అవినీతిపై దర్యాప్తు కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని కేటీఆర్, హరీష్ రావులకు ఆయన సవాల్ విసిరారు.