బీజేపీ 50 ఏళ్లైనా అధికారంలోకి రాదు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

3 months ago 9
గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భార‌తీయ జ‌న‌తా పార్టీపై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో బీజేపీ మరో 50 ఏళ్ల దాకా అధికారంలోకి రాదు అని ఆయ‌న పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫ‌లితంపై రాజాసింగ్ ఓ వీడియో విడుద‌ల చేశారు. బీజేపీ నేత‌లు మొండిత‌నంతో ముందుకు పోతున్నారు. ఎవ‌రి మాట విన‌డం లేదు. బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇంకో 50 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కనిపించడంలేదు. ఏ విధంగా గెల‌వాలి. ఓట‌రును ఏ విధంగా మ‌న వైపు మ‌ళ్లించుకోవాల‌నే విష‌యాల‌ను నేర్చుకోండి. ఏదైనా విష‌యం చెప్తే ఆలోచించండి. తెలంగాణలో బీజేపీ చనిపోతుంది, కిషన్ రెడ్డి గారు దయచేసి కాపాడండి అని ఎమ్మెల్యే రాజాసింగ్ వేడుకున్నారు.
Read Entire Article