తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పార్టీలో వర్గపోరు నడుస్తుండగా, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఎన్నిక నిర్వహించాలని, 'నావాడు, నీవాడు' అనే ధోరణి వద్దని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే పార్టీకి నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. తనకు అవకాశం ఇస్తే గోరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తానని, హిందుత్వం కోసం పనిచేసే వారికే పదవి ఇవ్వాలని సూచించారు. రాజాసింగ్ వ్యాఖ్యలు పార్టీలోని కోల్డ్ వార్ను బయటపెట్టాయి.