బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు క్లారిటీ ఇచ్చారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని కొట్టిపారేశారు. బీఆర్ఎస్ నేతలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తేజస్వీ సూర్య మాట్ల వెనుక అంతరార్ధం వేరని వివరణ ఇచ్చారు. అదే సమయంలో బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేదా అని రామచందర్ రావు ప్రశ్నించారు.