టీడీపీకి చెందిన పలువురు నేతలపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డి, ధర్మవరం ఇంఛార్జి పరిటాల శ్రీరామ్, పులివెందుల టీడీపీ ఇంఛార్జి బీటెక్ రవిపై నారా లోకేష్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. బుధవారం టీడీపీ నేతలతో జరిగిన సమీక్షా సమావేశం సందర్భంగా.. వీరిపై నారా లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.