బీసీ 'డి' నుంచి 'ఎ' గ్రూపులోకి ముదిరాజ్ల మార్పు ఖాయమని కాంగ్రెస్ మెదక్ ఇన్ఛార్జి నీలం మధు వెల్లడించారు. త్వరలో జరిగే బహిరంగ సభ ఏర్పాటు చేసి సీఎం రేవంత్రెడ్డి ఈ ప్రకటన చేస్తారని వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా ముదిరాజ్లు ఉండగా.. ఇటీవల మంత్రివర్గంలో వాకిటి శ్రీహరికి చోటు, టీపీసీసీ కార్యవర్గంలో ముదిరాజ్లకు కీలక పదవులు కట్టబెట్టారు.