బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 8న కరీంనగర్లో బీసీల భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, బీఆర్ఎస్ తరఫున రాష్ట్రపతిని కలుస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మభ్యపెడుతోందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని తలసాని ఆరోపించారు.