బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో మద్దతు తెలిపి, ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక న్యాయం, తెలంగాణకు మరో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ఆమోదం తెలిపితే సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై ఖర్గే, రాహుల్ గాంధీతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు.