Anantapur Bikes Theft Gang Arrest: హైదరాబాద్కు చెందిన ఒక ముఠా నకిలీ పత్రాలతో ఫైనాన్స్ ద్వారా బైక్లు కొనుగోలు చేసి, వాటిని తక్కువ ధరకు అనంతపురం జిల్లాలో అమ్మేస్తూ మోసాలకు పాల్పడింది. పోలీసులు ఈ ముఠాలోని కొందరిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా OLX నుండి నంబర్లు సేకరించి, కొత్త బైక్లకు అతికించి ప్రజలను నమ్మించి మోసం చేసింది. ఇలా దాదాపు 2 వేల బైక్లను అమ్మినట్లు తెలుస్తోంది.