తిరుమల శ్రీవారికి మరోసారి భారీ విరాళం అందింది. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన భక్తుడు టీటీడీ ట్రస్టులకు రూ.20 లక్షలు విరాళంగా అందించారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు, ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు పదేసి లక్షలు చొప్పున మొత్తం రూ.20 లక్షలు విరాళంగా అందించారు. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు నరసింహరాజు ఈ విరాళం సమర్పించారు.