ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆషాఢ మాసోతవ్సవాలు ముగిశాయి. ఈ ఏడాది అమ్మవారికి ఆషాఢం సారెలు అందించడంలో ఆల్ టైమ్ రికార్డు నమోదయిందని అధికారులు చెబుతున్నారు. ఆరు లక్షల ఆషాఢం సారెలు సమర్పించినట్లు పేర్కొన్నారు. వందాలది మంది భక్త బృందాలు ఈ సారెను సమర్పించినట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కో భక్త బృందాల్లో నాలుగైద వేల మంది భక్తులు ఉన్నారని.. వారికి సపరేట్ టైమ్ స్లాట్ ఇవ్వడంతోనే ఎలాంటి రద్దీ లేకుండా ఆషాఢం సారెలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు.