బెజవాడ దుర్గమ్మ దర్శనం కోసం దసరా నవరాత్రి వేడుకల్లో ఈసారి భక్తులు భారీగా తరలివచ్చారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని అనుగ్రహం పొందేందుకు భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం దసరా ఉత్సవాలు ముగిసినప్పటికీ ఇంద్రకీలాద్రిపై రద్దీ కొనసాగుతోంది. దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత భవానీ భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి వరకూ భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈసారి రద్దీ పెరగడానికి రెండు కారణాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.