శ్రీశైలంలో అడవి జంతువులు జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. చిరుతలు, ఎలుగుబంట్లు, జింక, దుప్పి ఇలా అడవి జంతువులు అభయారణ్యం వదిలి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. గతంలో ఎలుగుబంట్లు వంటి జంతువు మాత్రమే వచ్చేవి. కానీ, ఇప్పుడు చిరుతపులులు వచ్చేస్తున్నాయి. గతంలో శ్రీశైలంలో అడవి దుప్పి హల్చల్ చేసింది. జనావాసాల్లోకి రావడంతో గమనించిన కుక్కలు దానిని తరిమాయి. ఇలాంటి ఘటన తరుచూ జరుగుతూనే ఉన్నాయి. ఈ నెల మొదటి వారంలో పూజారి ఇంట్లోకి చిరుత వచ్చింది.