బొగ్గు ఉత్పత్తిలో అపార అనుభవం కలిగిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఖనిజ అన్వేషణలో మరో మెట్టు ఎక్కింది. కర్ణాటకలోని దేవదుర్గ్ ప్రాంతంలో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ను దక్కించుకుంది. వేలంలో 37.75% రాయల్టీతో L-1 బిడ్డర్గా నిలిచినట్లు సీఎండీ ఎన్. బలరామ్ తెలిపారు. ఇది సింగరేణికి శుభారంభమని, ఇతర రంగాల్లో విస్తరణకు తొలి అడుగు అని ఆయన పేర్కొన్నారు. ఈ విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.