బొల్లారం ఆర్మీ క్యాంపులో ఆయుధాలు, మందుగుండు చోరీ కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయుధాలు ఒకేసారి కాకుండా గత 3 నెలలుగా విడతలవారీగా మాయమైనట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఏకే-203 రైఫిళ్లు, ఇన్సాస్, 9 ఎంఎం పిస్టళ్లతో పాటు భారీ సంఖ్యలో బుల్లెట్లు, మ్యాగజైన్లు మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఫైరింగ్ రేంజ్ సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభించడం అనుమానాలను పెంచింది.