Andhra Pradesh High Court On Borewell And Ro Water Plant: బోర్లు, ఆర్వో ప్లాంట్లకు అనుమతులు తప్పనిసరి అంటోంది ఏపీ హైకోర్టు. సురక్షిత తాగునీరు పొందడం జీవించే హక్కులో భాగమని.. అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని వ్యాఖ్యానించింది. ఆర్వో ప్లాంట్పై పిటిషనర్ దరఖాస్తు చేసుకుంటే చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అలాగే పిటిషనర్ అధికారులు ఇచ్చిన నోటీసుకు వివరణ కూడా ఇవ్వాలని కూడా ఏపీ హైకోర్టు ఆదేశించింది.