హైదరాబాద్లో అక్రమంగా సరోగసి నిర్వహిస్తున్న కేంద్రాలపై పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగానే ఇటీవల మేడ్చల్ సరోగసి కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పోలీసులే ఆశ్చర్యపోయే విధంగా నిజాలు వెలుగులోకి వచ్చాయి. మేడ్చల్ సరోగసి వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన లక్ష్మిరెడ్డి తన ఇంటి ఫస్ట్ఫ్లోర్ను బ్యాచ్లర్స్కు అద్దెకు ఇచ్చి మరీ.. వీర్యం సేకరించేందని పోలీసులు అనుమానిస్తుననారు. సరోగసి కోసం మహిళలు కావాలన్నా ఈమె ఏర్పాటు చేసేదని పోలీసులు తెలిపారు.