హైదరాబాద్లో సంతోష్ ధాబా పేరుతో పనిచేస్తున్న నకిలీ రెస్టారెంట్లపై చర్యలు మొదలయ్యాయి. సంతోష్ ధాబా అసలు యజమాని మనోజ్ కుమార్ సాంగ్లా తన బ్రాండ్ పేరును చట్టవిరుద్ధంగా వాడుతున్నారని ఆరోపిస్తూ కోర్టులో కేసు దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు.. నగరవ్యాప్తంగా 50కి పైగా నకిలీ 'సంతోష్ ధాబా' బోర్డులను అధికారులు తొలగించారు. బ్రాండ్ నాణ్యత, విశ్వసనీయతకు భంగం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నారు. వినియోగదారులు అసలు, నకిలీ ధాబాలను గుర్తించాలని అధికారులు సూచిస్తున్నారు.