తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభమైంది. లక్షలాది మంది భక్తులు తరలివస్తుండగా, ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి 2026లో జనాలు ఎక్కువగా ఉండే చోట్ల పెను సంచలనం, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు తీవ్రతరం అవుతాయని హెచ్చరించారు. జాతరలోనూ అదే జరగొచ్చని శాస్త్రంలో ఉన్నదానినే తాను చెబుతున్నట్లు వెల్లడించారు.