టీటీడీలో వచ్చే రెండు నెలల్లో కీలక సంస్కరణలు చేపట్టనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఇటీవలే కొంతమంది అధికారులను బదిలీ చేశామన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేలా వచ్చే రెండు నెలల్లో బోర్డులో కీలక సంస్కరణలు తీసుకువస్తామన్నారు. మరోవైపు టీటీడీలో ఉద్యోగుల బదిలీల అంశంలో జాప్యం కొంతమేరకు అసంతృప్తికి కారణమైందంటూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అభిప్రాయపడ్డారు.