తిరుపతి అలిపిరి టోల్గేట్ దగ్గర వాహనాల రద్దీని తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అదనపు మార్గాల ఏర్పాటుతో పాటు అత్యాధునిక స్కానర్లను ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి సెలవుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పడుతోంది. రద్దీని తగ్గించి భక్తులకు మరింత సౌకర్యం కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.