తిరుపతి నుంచి మరికొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలకు విమాన సర్వీసులు నడిపిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ మేరకు కసరత్తు జరుగుతోందని అన్నారు. రేణిగుంట ఎయిర్పోర్టు నుంచి గల్ఫ్ దేశాలకు సైతం విమాన సర్వీసులు నడపనున్నట్లు స్పష్టం చేశారు.