తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి జి కిషన్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఉప్పుగూడ, మలక్పేట రైల్వే స్టేషన్లలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అమృత్ భారత్ పథకం కింద రూ. 26 కోట్లతో ఉప్పుగూడ స్టేషన్ను డిసెంబర్ కల్లా ఆధునీకరిస్తామన్నారు. అలాగే ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా భాగ్యనగరం నుంచి యాదగిరిగుట్ట వరకు రైలును పొడిగించనున్నట్లు ప్రకటించారు. గత 12 ఏళ్లలో రాష్ట్రంలో 347 కి.మీ. కొత్త రైల్వే లైన్లు వేసినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.