తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఖమ్మం జిల్లాల్లో అత్యధికంగా 39.8 డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న నాలుగు రోజులు కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుతాయని.. ఆ తర్వాత మళ్లీ ఎండలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.