భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులను ఆగమ శాస్త్రానుసారం, సహజత్వం దెబ్బతినకుండా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 2027 మార్చి నాటికి తొలి దశ పనులు పూర్తి చేయాలని, ముఖ్యంగా వచ్చే గోదావరి పుష్కరాల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఘాట్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. మూడు దశల్లో జరిగే ఈ ప్రాజెక్టు కోసం డిజైన్లను పరిశీలించిన సీఎం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.