భద్రాచలం రామాల‌య ఈఓపై దాడి.. స్పృహ త‌ప్పి ప‌డిపోయిన అధికారి..

8 months ago 17
భద్రాద్రి రామాలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడి చేయడంతో కలకలం రేగింది. ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు అడ్డుకునేందుకు వెళ్లిన ఆమెపై దాడి జరిగింది. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి ఆక్రమణదారులు నిర్మాణాలు చేస్తుండటంతో ఈవో వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దాడిలో స్పృహ కోల్పోయిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన దేవాదాయ శాఖ ఉద్యోగులకు, ఆక్రమణదారులకు మధ్య వివాదానికి దారితీసింది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.
Read Entire Article