భద్రాచలం వెళ్లకుండానే మన ఇంట్లో ఉండే సీతారాముల కళ్యాణ తలంబ్రాలను టీజీఎస్ఆర్టీసీ అందించనుంది. రూ.151 చెల్లించి బుక్ చేసుకుంటే.. దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి తలంబ్రాలను హోం డెలివరీ చేయనున్నారు. ఆన్లైన్తోపాటు, ఆఫ్లైన్లోనూ ఈ తలంబ్రాలను బుక్ చేసుకునే సౌకర్యాన్ని అధికారులు కల్పించారు. ఇంతకీ ఎలా తలంబ్రాలు బుక్ చేసుకోవాలి.. ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.