భద్రాచలం మన్యానికి మహర్దశ పట్టనుంది. భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని 19 మండలాల్లోని 130 గ్రామాలకు కేంద్రం ఆదికర్మ యోగి పథకం కింద రూ.260 కోట్లు కేటాయించింది. ఐటీడీఏ అధికారులు 19 మండలాల్లోని 130 గ్రామాలను సందర్శించి, రచ్చబండ సభల ద్వారా గిరిజనుల సమస్యలు, అవసరాల వివరాలు సేకరించారు. ప్రతి గ్రామానికి ఐదేళ్ల పాటు రూ.2 కోట్లు అత్యవసర వసతులకు కేటాయిస్తారు. ఈ మొత్తంతో విద్యుత్తు, రోడ్లు, విద్య, వైద్యం వంటి సదుపాయాలు కల్పించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు..