మార్చి 19 నుండి ఏప్రిల్ 2 వరకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 27న జరిగే శ్రీరామనవమి కల్యాణం, 28న పట్టాభిషేకం జరగనుండగా సెక్టార్ టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. కల్యాణ టికెట్ల ధరలు రూ. 100 నుండి రూ. 7,500 వరకు ఉండగా.. ఆలయానికి రాలేని భక్తులు ఆన్లైన్లో గోత్ర నామాలతో పూజలు చేయించుకునే వీలుంది.