భద్రాద్రి రామయ్య భక్తులకు గుడ్న్యూస్. రాములోరి కల్యాణానికి వెళ్లలేకపోయిన భక్తుల కోసం పోస్టల్ శాఖ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంటికే కల్యాణ తలంబ్రాలు పంపించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సమీపంలోని పోస్టల్ ఆఫీసుకు వెళ్లి రామయ్య తలంబ్రాల కోసం రూ.150 పెట్టి ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలా చేస్తే ఇంటికే తలంబ్రాలు పంపించనున్నారు.