ప్రభుత్వ ఉద్యోగి భార్య, తన స్థాయిని మర్చిపోయి తోటి ప్రయాణికురాలి పర్స్ దొంగిలించింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం చేసిన తర్వాత, ఆమె తన భర్తతో కలిసి వేరే బస్సులో వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ సంఘటన విజయవాడ బస్టాండ్లో వెలుగు చూసింది. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. నిందితురాలి భర్త అయిన ఎంపీడీవో భార్యను కాపాడే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..