భర్త మాటలు నమ్మి బైక్ ఎక్కిన భార్య.. చివరకు పాపం!

7 months ago 13
భర్తపై పెట్టుకున్న నమ్మకమే ఆమె పాలిట శాపం అయ్యింది. పోలీసుల దగ్గరకు వెళితే.. తన కాపురం చక్కబడుతుందని భావించింది. భర్త చెప్పిన మాటలను నమ్మి.. ఆయన బైక్‌పై బయలు దేరింది. కానీ, అదే ఆ మహిళకు చివరి మజిలీ అయ్యింది. మద్యానికి బానిసైన భర్త, ఓ భార్యను నమ్మకంగా కడతేర్చిన ఘటన నరసరావుపేటలో ఆదివారం వెలుగు చూసింది. కంభంపాలేనికి చెందిన తొరటి మేరి.. సత్తెనపల్లి మండలం గార్లపాడుకు చెందిన జొన్నలగడ్డ రమేష్‌ను ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకుంది. రమేష్‌ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన రమేష్‌, భార్యను అనుమానిస్తూ వేధిస్తూ ఉండేవాడు. అయితే, మేరి.. శనివారం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తానని భర్తను బెదిరించింది. అయితే, తాను కూడా వస్తానని బైక్‌పై రమేష్ ఆమెను ఎక్కించుకున్నాడు. అయితే, ఆమెను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లకుండా రావిపాడు రోడ్డు వైపు తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని తల్లి కోటమ్మకు ఫోన్‌ చేసి మేరి చెప్పింది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరి సెల్‌ఫోన్లు స్విచ్‌ఆఫ్‌ అని రావటంతో అనుమానం వచ్చిన కోటమ్మ వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే, రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. శనివారం మేరిని బైక్‌పై భర్త రమేష్‌ నకరికల్లు నుంచి కారంపూడి వెళ్లే మార్గంలో రైల్వే ట్రాక్‌ పక్కన ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె గొంతును చున్నీతో బిగించి కాలుతో నొక్కి దారుణంగా హత్య చేశాడు. రమేష్‌ ఇచ్చిన సమాచారంతో ఆదివారం వన్‌టౌన్‌ సీఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పాపం భర్త వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసి తన కాపురాన్ని దారిలోకి తెచ్చుకుందామని అనుకుంది. కానీ, ఆ కసాయి భర్త ఆమెనే చంపేశాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు తల్లి లేని అనాథలుగా మారారు.
Read Entire Article