తెలుగు రాష్ట్రాల్లో భర్తల హత్యలు కలకలం రేపుతున్నాయి. గద్వాలలో భార్య, ప్రియుడు కలిసి భర్తను చంపడం సంచలనంగా మారింది. వివాహేతర సంబంధాలే ఈ దారుణాలకు కారణమని సీనియర్ నేత వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. సతీ సావిత్రి కథను గుర్తు చేస్తూ, నేటి సమాజంలో భార్యలే భర్తలను చంపడం దుర్మార్గమని ఆయన అన్నారు. ప్రేమ పేరుతో హత్యలు చేయడం కూడా సరికాదన్నారు. గతంలో తాను భూముల కోసం కొట్టుకున్న అన్నదమ్ములను చూశాను తప్ప.. ఇలాంటివి ఎప్పుడు చూడలేదని తెలిపారు.