గత కొన్ని రోజులుగా మండిపోతున్న ఎండలకు కాస్త బ్రేక్ లభించనుంది. రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట నాశనం అవుతోందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.