ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ కమిషనర్ యాదల మహేశ్వరరావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన నివాసాలతో పాటు బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో 729 గ్రాముల బంగారం, 9 కేజీలకు పైగా వెండి, రూ.2.6 లక్షల నగదు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరరావు విధి నిర్వహణలో అవినీతికి పాల్పడుతూ భారీ మొత్తంలో అక్రమ సంపాదన కూడబెట్టారనే సమాచారం రావడంతో.. ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.