తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా కొన్ని గ్రామాల్లోని చెరువులు అలుగు పారుతున్నాయి. దీంతో ఆయా గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అయిన ఏడుపాయల అమ్మవారి ఆలయానికి వరద ముంపు పొంచి ఉంది. ఇక్కడ మంజీర నదిలోకి నీరు విపరీతంగా వచ్చి చేరడంతో అధికారులు నీటిని కిందకు వదిలారు. దీంతో ఆ వరద ఈ ఆలయానికి చేరే అవకాశం ఉందని.. ముందుగానే ఆలయాన్ని మూసేశారు.