కామారెడ్డి జిల్లాలో నిరంతర వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగిపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. జిల్లా విద్యా శాఖ అధికారి రాజు ప్రకటన ప్రకారం రేపు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, ములుగు జిల్లాల్లోనూ విద్యార్థుల తల్లిదండ్రులు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.