హైదరాబాద్ నగర ప్రయాణికుల కోసం కొత్తగా మరో అధునాతన సౌకర్యం అందుబాటులోకి రానుంది. మార్చి 3వ తేదీ నుండి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఆధ్వర్యంలో నగరంలోని బస్ స్టాప్లలో డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. ఈ డిజిటల్ స్క్రీన్ల ద్వారా బస్సుల రాకపోకల సమయాలను నిజ సమయ (రియల్-టైమ్) డేటాతో ప్రదర్శించనున్నారు.