తెలంగాణ పంచాయతీ కార్యదర్శులు తమ సమస్యల పరిష్కారం కోసం మంత్రి సీతక్కను కలిశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ (Regularization), ప్రొబేషన్ డిక్లరేషన్, ఔట్సోర్సింగ్ విధానం రద్దు, సమ్మె కాలాన్ని సర్వీస్గా పరిగణించడం వంటి డిమాండ్లను వినతిపత్రంలో సమర్పించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క, న్యాయమైన పరిష్కారం చూపుతామని, త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని.. సంబంధిత అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.