అదనపు కట్నం కోసం భార్యను వేధించి, ఆమె ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన భర్త కేసులో మహబూబ్నగర్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. జోగుళాంబ గద్వాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత.. నిందితుడు చాకలి హరికృష్ణకు ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు 2500 రూపాయల జరిమానా విధించారు. ఈ కేసులో పోలీసులు పకడ్బందీగా విచారణ నిర్వహించి, నేరస్థుడికి శిక్ష పడేలా చేశారు. దీనికి సంబధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..