ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ ఆత్మహత్య రాష్ట్రంలో కలకలం రేపుతోంది. స్వేచ్ఛ మృతిపై ఆమె తండ్రి సంచలన విషయాలు వెల్లడించారు. పూర్ణచందర్ రావు అనే వ్యక్తి వల్లే తన కూతురు చనిపోయిందని. అతడు కనిపించిన అమ్మాయిలను అనుభవించే మృగం లాంటి వాడని ఆరోపించారు. తమ కూతురి మరణంపై అనుమానాలున్నాయని చెప్పారు. ప్రభుత్వం విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాంటి వారిని కఠినంగా మళ్లీ ఏ అమ్మాయి జోలికి పోకుండా కఠినంగా శిక్షించాలన్నారు.