Salur Young Man Died On Omelet Issue: పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య ఆమ్లెట్ విషయంలో చిన్న గొడవ జరిగింది. ఆమ్లెట్ సరిగా లేదని భర్త కోప్పడటంతో భార్య పిల్లలతో పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో మనస్తాపం చెందిన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్న గొడవ ఎంతటి విషాదానికి దారితీసిందో చూడండి.