ఎవరెస్ట్ శిఖరంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది. తిరుపతి వైసీపీ ఇంఛార్జి భూమన అభినయ్ రెడ్డి ఎవరెస్ట్ శిఖరంపై వైసీపీ జెండా ఎగరేశారు. స్నేహితులతో కలిసి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్న భూమన అభినయ్ రెడ్డి.. 5,364 మీటర్ల ఎత్తులో జెండాను ఎగరేశారు. ఎవరెస్ట్పై ఎగిరిన తరహాలోనే ఏపీలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తామని భూమన అభినయ్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి ఇక్కడకు చేరుకున్నామని.. ఏపీలోని వైసీపీ కార్యకర్తలు కూడా ఇలాగే కష్టపడి రాష్ట్రంలో వైసీపీ జెండా ఎగరేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.