ఎస్వీ గోశాల అంశం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. అసత్య ఆరోపణలు చేసి తిరుమల భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా తిరుపతి ఎస్వీయూ పోలీస్ స్టేషన్లో భూమనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కేసుపై భూమన స్పందించారు. ఇలాంటి కేసులు వంద పెట్టినా భయపడేది లేదని.. ప్రశ్నించేది ఆపేది లేదని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.