రాష్ట్రంలో జూన్ 5 నుంచి సవరించిన భూముల మార్కెట్ ధరలు అమల్లోకి వస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. భూ విలువ సవరణ శాస్త్రీయంగా, హేతుబద్ధంగా చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. క్షేత్రస్థాయి అధ్యయనం, మార్కెట్ పరిస్థితులను బేరీజు వేసుకుని కొత్త విలువలు నిర్ణయించినట్టు చెప్పారు. నిపుణులు, అధికారుల సలహాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రాంతాలవారీగా మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్లు పరిశీలించినట్టు వివరించారు.