భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రెవెన్యూ శాఖ నూతన సంస్కరణలకు సిద్ధమైంది. ఇకపై ప్రతి దరఖాస్తుకు సబ్ డివిజన్ సర్వే పటం తప్పనిసరి చేసింది. డబుల్ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల అక్రమాలను నిరోధించేందుకు 3,456 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించింది. భూ భారతి చట్టంలో ప్రత్యేక సెక్షన్ ఏర్పాటుతో ఖచ్చితమైన వివరాలు నమోదు చేయనున్నారు.